కథా ప్రయాణం-13
తెలుగు సాహిత్యంలో రెండు సంఘటనలు తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి. భిన్న మనస్తతత్వాలు, భిన్న ధోరణులు, తూర్పు,పడమరలు. వారు ఒకరు చలమైతే, మరొకరు కథా మాణిక్యం మునిమాణిక్యం నరసింహారావు. ఒకరు విశృంఖుల శృంగారాన్ని ప్రోత్సహిస్తే మరొకరు దాంపత్యంలోని మధురిమలను అందించారు. భార్య అంటే ఎలా ఉండాలి?సంసారంలోని మధురిమలు ఎల పొందాలి అన్న విషయాన్ని హాస్యభరితంగా చెప్పాడు మునిమాణిక్యం. మునిమాణిక్యం కథానాయక కాంతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో కాంతం ఐస్కాంతంలా ఎందరిని అలరించలేదు. కాంతం పేరు తెలియని తెలుగు పాఠకుడు ఉండడు. పరమ సంతోషకరమైన కుటుంబ జీవిత ఇతివృత్తాన్ని కథగా చెప్పిన కథా కృషీవలుడు. గందరగోళంగా ఉన్న తెలుగు సాహిత్యంలో ఒయాసిస్సు లాగా, వెన్నెల రాత్రి లాగా ఆయన కథలు దర్శనమిస్తాయి. కాంతం కథలు నేను నా కాంతం, తిరుమాలిగ, రుక్కుతల్లి లాంటి హాస్య కథలు ఎన్నో రాశారు. ఆయన కథలన్నీ శారద రాత్రులే.
No comments:
Post a Comment