Thursday 10 April 2014

కధాయాత్ర - 18

కధాయాత్ర - 18
       శివశంకరులు పూర్వాశ్రమంలో శివశంకరశాస్త్రి. వీరి పేరు చెప్పగానే సాహిత్య అభిమానులకు హృదేశ్వరి నవకళామాలిక వంటి ఖండకావ్యాలను ప్రచురించారు. ప్రఖ్యాత కధకులు విశ్వనాధ, వేలూరి, చెలం, కొనికళ్ల, అందే నారయణ లాంటి చాలామందితో స్నేహసంబంధాలు ఉండేవి. వీరు స్థాపించిన సాహిత్యమాస పత్రిక సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్ వంటి సంస్థలను ఏకతాటి మీద నడిపారు. పలు సంకలనాలకు సంపాదకత్వ బాధ్యతలను వహించారు. నీలకంఠం పేరుతో కధాసంకలనాన్ని ప్రచురించారు. అలనాటి పల్లెటూళ్లు విద్యావిదానం చెండామార్కులు స్థాయిలో పిల్లల్ని దండించడం, బలవంతపు  చదువుల నేపధ్యంలో వ్రాయబడ్డ అద్భుత కధ "గాదే". గ్రామాల్లో వడ్లు దాచుకొనే కట్టడం.

Monday 7 April 2014

కధాయాత్ర - 18

కధాయాత్ర - 18
తొలితరం కధకుల్లో కవికొండల వెంకటరావుగారు ముఖ్యులు. భావకవితా యుగంలో ప్రసిధ్దులైన కవికధకులు, నాటక కర్తలు, వ్యాసరచయిత, నవలా రచయిత బహుపాత్రలు పోషించిన అధుత శిల్పి. భావకవితా రచయితగా కవికొండల వెంకటరావ్ సామాన్యుల కోసం తన సాహిత్యాన్ని వారికందేలా చేసారు. కర్షక, కార్మిక, శ్రామిక వర్గల్లోంచి వచ్చిన కధలకు ప్రాణం పోసారు. వీరిని "లి"గార్లు అనేవారు. కష్టజీవుల పనిముట్లు గొడ్డలి, నాగలి, కొడవలి మెదలైనవి "లా" అక్షరమైనవి కదా. అందుకే వీరిని లిగార్లు అనేవారు. లిగాడు పేరుతో గొప్ప కధనే రాశారు. 200లకు పైగా కధలు రాశారు. 10కి పైగా కధాసంపుటాలు వెలువడ్డాయి. కంఠధ్వని , మట్టెల రవళి, ఉద్యోగపు బుధ్ది ప్రధానమైనవి.