Monday 7 April 2014

కధాయాత్ర - 18

కధాయాత్ర - 18
తొలితరం కధకుల్లో కవికొండల వెంకటరావుగారు ముఖ్యులు. భావకవితా యుగంలో ప్రసిధ్దులైన కవికధకులు, నాటక కర్తలు, వ్యాసరచయిత, నవలా రచయిత బహుపాత్రలు పోషించిన అధుత శిల్పి. భావకవితా రచయితగా కవికొండల వెంకటరావ్ సామాన్యుల కోసం తన సాహిత్యాన్ని వారికందేలా చేసారు. కర్షక, కార్మిక, శ్రామిక వర్గల్లోంచి వచ్చిన కధలకు ప్రాణం పోసారు. వీరిని "లి"గార్లు అనేవారు. కష్టజీవుల పనిముట్లు గొడ్డలి, నాగలి, కొడవలి మెదలైనవి "లా" అక్షరమైనవి కదా. అందుకే వీరిని లిగార్లు అనేవారు. లిగాడు పేరుతో గొప్ప కధనే రాశారు. 200లకు పైగా కధలు రాశారు. 10కి పైగా కధాసంపుటాలు వెలువడ్డాయి. కంఠధ్వని , మట్టెల రవళి, ఉద్యోగపు బుధ్ది ప్రధానమైనవి.

No comments:

Post a Comment