Tuesday 10 December 2013

కధాయాత్ర - 8

కధాయాత్ర - 8

ఆధునిక కధాసాహిత్యంలో చలం అంతటి వివాదస్పద రచయిత మరొకరు వుండరు. ఒకానొక దశలో సాహిత్య భహిష్కరణకు గురి అయిన రచయిత చలం తప్ప మరొకరు లేరేమో. "చలం సాహిత్యాన్ని ప్రచురించటానికి భయపడే రోజులు కుటుంబ స్త్రీలు చలాన్ని చదవటానికి భయపడే రోజులు చలం కధా అసదృశ్యుడు. "స్త్రీ" స్వేచ్ఛకోసం తపించిన వ్యక్తి అని అభిమానులు చెప్పుకుంటారు. కధల్లో, శృంగారరసం ఎక్కువ, అందుకే చలాన్ని చదవటం  భయపడేవారు అంతర్గతంగా చలాన్ని చదివిన వారు లేకపోలేదు.  "గ్రహణం" , "ఓపూవు పూసింది", ప్రసిద్ధం. 'దైవమిచ్చిన భార్య, "మైదానం" విమర్శకులను ఆకర్షించాయి.  స్త్రీలను గురించి పోరాడిన చలం, చివరిదశలో అస్త్రసన్యాసం చెయ్యటం పొరపాటేనంటారు.

No comments:

Post a Comment